సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ

సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నవంబరు 10వ.తేదీ, 2013 సాయంత్రము.గం.4.30 నిమిషాలకు సామూహిక శ్రీసాయి శక్తి మహాపూజ షిర్దీ సాయి తత్వ ప్రచార సమితి వారిచే నిర్వహింపబడుతున్నది. స్వామి సాయి శ్రీ విశ్వచైతన్య గారు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యము వహించెదరు.భక్తులందరూ కూడా వేదిక వద్దకు ఖచ్చితముగ గం.4.30 నిమిషాలకు రావలెను.పూజా సామాగ్రి భక్తులందరికీ సమితి వారిచే ఉచితముగా యివ్వబడును. 30 సంవత్సరములు శిరిడీలో సాయిబాబాకు అలంకరణ చేసిన స్వర్ణకిరీటమును భక్తులందరూ దర్శించుకొనే భాగ్యము కలదు. ఈ సదవకాశమును అందరూ వినియోగించుకోవలసినదిగా కోరబడుతున్నారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి